జీవో 77ను వెంటనే రద్దు చేయాలి: ప్రణవ్ గోపాల్
ABN, First Publish Date - 2021-01-07T23:38:05+05:30
జీవో 77 వెంటనే రద్దు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు.
విశాఖ: ఉన్నత విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు.పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడం దుర్మార్గమన్నారు. ఈ జీవోతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకోవద్దన్నారు. రాష్ట్రంలో పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు కలెక్టర్లకు వినతిపత్రం ఇస్తామని ప్రణవ్ గోపాల్ తెలిపారు. 11న అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలుపుతామని ప్రకటించారు. అలాగే జనవరి 22వ తేదీన సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామన్నారు. ప్రభుత్వం మొండిపట్టు పట్టొద్దని ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు.
Updated Date - 2021-01-07T23:38:05+05:30 IST