జగన్ను కలిసిన గణపతి సచ్చిదానంద స్వామి
ABN, First Publish Date - 2021-10-18T22:59:32+05:30
సీఎం జగన్ను గణపతి సచ్చిదానంద స్వామి కలిశారు. హిందూ ధర్మాన్ని, ఆలయాల భూములను కాపాడాలని కోరినట్లు వెల్లడించారు.
విజయవాడ: సీఎం జగన్ను గణపతి సచ్చిదానంద స్వామి కలిశారు. హిందూ ధర్మాన్ని, ఆలయాల భూములను కాపాడాలని కోరినట్లు వెల్లడించారు. సీఎం జగన్ను హిందూ విరుద్ధ వ్యక్తిగా కొందరు ప్రచారం చేస్తున్నారని, ఏపీ ప్రభుత్వం ఆలయాల పట్ల చిత్తశుద్ధితో ఉందని గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. జగన్ హిందూ ధర్మాన్ని, మతాన్ని పరిరక్షిస్తారని బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టడం సరికాదన్నారు.
Updated Date - 2021-10-18T22:59:32+05:30 IST