ఏపీకి కేంద్రం తీరని అన్యాయం: గల్లా జయదేవ్
ABN, First Publish Date - 2021-03-16T00:59:19+05:30
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసిందని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసిందని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ.. విభజన నష్టాలు, ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. నిధుల కేటాయింపుల్లో ధనిక రాష్ట్రాలకే ఎక్కువ కేటాయింపులు చేశారన్నారు. విశాఖ రైల్వేజోన్ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం శోచనీయమని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.
Updated Date - 2021-03-16T00:59:19+05:30 IST