ముగిసిన మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి అంత్యక్రియలు
ABN, First Publish Date - 2021-09-30T21:29:24+05:30
రచయిత, కార్మిక నాయకుడు, వైసీపీ నేత డాక్టర్ రమణారెడ్డి అంత్యక్రియలు ప్రొద్దుటూరు సమీపంలోని తాళ్ళమాపురంలో
కడప: రచయిత, కార్మిక నాయకుడు, వైసీపీ నేత డాక్టర్ రమణారెడ్డి అంత్యక్రియలు ప్రొద్దుటూరు సమీపంలోని తాళ్ళమాపురంలో వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు ముగిశాయి. రమణారెడ్డిని కడసారి చూసేందుకు ఆయన సన్నిహితులు రాజకీయ పార్టీల నేతలు వచ్చి నివాళులు అర్పించారు. అభిమానులు ఆయన అంత్యక్రియల్లో భారీగా పాల్గొన్నారు. రమణారెడ్డి కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. కర్నూలులోని మెడిక్యూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 5.30గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన భార్య లక్ష్మీకాంతమ్మ. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చిన్నకుమారుడు రాజారాంమోహన్రెడ్డి భార్య మల్లెల ఝాన్సీరాణి ఆప్కాబ్ చైర్పర్సన్గా ఉన్నారు. రమణారెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు, ఉద్యమ మిత్రులు, అభిమానులు, సాహితీ మిత్రులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు.
Updated Date - 2021-09-30T21:29:24+05:30 IST