ప్రమాణం చేయాల్సి వస్తుందనే రద్దు: అయ్యన్న
ABN, First Publish Date - 2021-04-11T09:32:10+05:30
ప్రమాణం చేయాల్సి వస్తుందనే రద్దు: అయ్యన్న
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): బాబాయి హత్యపై ప్రమాణం చేయాల్సి వస్తుందనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తిరుపతి పర్యటన రద్దు చేసుకొన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన రద్దుపై శనివారం ఆయన ట్విటర్లో స్పందించారు. ‘‘14న తిరుపతి వచ్చి ఉంటే బాబాయి హత్య మిస్టరీ తేలిపోయేది. అందుకే జగన్ రెడ్డి గారు తన పర్యటన రద్దు చేసుకొన్నారు. వెంకన్న సాక్షిగా ప్రమాణం అనగానే పరార్ అయ్యారు’’ అని అయ్యన్న అన్నారు.
Updated Date - 2021-04-11T09:32:10+05:30 IST