అడవిలో మంటలు
ABN, First Publish Date - 2021-03-03T09:36:19+05:30
పాడేరు ఘాట్ మార్గానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం మంటలు చెలరేగాయి. మైదాన ప్రాంతం
పాడేరు (విశాఖపట్నం), మార్చి 2: పాడేరు ఘాట్ మార్గానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం మంటలు చెలరేగాయి. మైదాన ప్రాంతం నుంచి పాడేరు వైపు వచ్చే మార్గంలో గరికబంద సమీపంలోని అడవుల్లో మంటలు ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారి కంటబడ్డాయి. కొందరు ఆసక్తిగా తిలకించగా, మరికొందరు ప్రకృతి ధ్వంసమవుతుందని ఆవేదన చెందుతూ మీడియాకు సమాచారం ఇచ్చారు. అడవుల్లో చిచ్చుకు కారణాలు తెలియాల్సి ఉంది.
Updated Date - 2021-03-03T09:36:19+05:30 IST