పదవ రోజుకు చేరుకున్న రైతుల మహాపాదయాత్ర
ABN, First Publish Date - 2021-11-10T12:41:21+05:30
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర పదవ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర
ప్రకాశం: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర పదవ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర జరుగుతోంది. పదవ రోజు ప్రకాశం జిల్లా దుద్దుకూరు నుంచి పాదయాత్రం ప్రారంభంకానుంది. దుద్దుకూరు నుంచి నాగులుప్పలపాడు వరకు యాత్ర సాగనుంది. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. జిల్లాలో పాదయాత్రకు స్థానికులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.
Updated Date - 2021-11-10T12:41:21+05:30 IST