విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి రైతు బలి
ABN, First Publish Date - 2021-04-10T23:43:47+05:30
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు బలి అయ్యాడు. విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ
నెల్లూరు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు బలి అయ్యాడు. విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని చిట్టమూరు మండలంలో జరిగింది. మండలంలోని గుణపాటిపాలెం గ్రామానికి చెందిన గోపాలయ్య అనే రైతు పొలంలో కరెంటు పనుల కోసం ఎల్సీ తీసుకున్నాడు. అనంతరం మరమ్మతు పనులు చేసుకుంటున్నాడు. ఇలా పనులు చేస్తుండగానే రైతుకు సమాచారం ఇవ్వకుండానే విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో విద్యుదాఘాతంతో రైతు అక్కడికక్కడే చనిపోయాడు. రైతు మృతితో అతని కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Updated Date - 2021-04-10T23:43:47+05:30 IST