ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Facebook లో యువతికి పరిచయం.. 9 లక్షల నగదు, 192 గ్రాముల బంగారు నగలు తీసుకొని..!

ABN, First Publish Date - 2021-10-17T12:38:41+05:30

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫ్రెండ్‌ చేతిలో తిరుపతికి చెందిన ఓ యువతి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఓ యువతికి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ టోపీ
  • ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం
  • 192గ్రాముల నగలు, రూ.9.33 లక్షలు కాజేశాడు

తిరుపతి : ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఫ్రెండ్‌ చేతిలో తిరుపతికి చెందిన ఓ యువతి మోసపోయారు. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. టీటీడీకి చెందిన ఓ ఇంజనీర్‌ కుమార్తెకు అనంతపురానికి చెందిన దీపాబాబు అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నిత్యం ఆమెతో చాట్‌చేస్తూ వచ్చిన అతను అనంతపురం కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకోసం కొంత ఖర్చు పెట్టాలంటూ.. విడతలవారీగా రూ.9.33 లక్షలతోపాటు 192 గ్రాముల బంగారు నగలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎటువంటి స్పందన లేదు. పైగా ఫేస్‌బుక్‌లోనూ కనిపించకుండా పోయాడు. మోసం చేశాడని ఆలస్యంగా గుర్తించిన ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. యువతి తండ్రి శనివారం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


Updated Date - 2021-10-17T12:38:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising