విశాఖ రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు
ABN, First Publish Date - 2021-11-09T00:40:41+05:30
విశాఖ రైల్వే స్టేషన్లో నగర పోలీస్ కమిషనర్ మనీష్కుమార్
విశాఖ: విశాఖ రైల్వే స్టేషన్లో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, డీసీపీ గౌతమి సాలి నేతృత్వంలో విస్తృతండి తనిఖీలు నిర్వహించారు. పరివర్తన పేరుతో రైల్వే స్టేషన్లో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. గంజాయ్, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతోనే తనిఖీలు నిర్వహిస్తున్నామని కమిషనర్ తెలిపారు. నగర పరిధిలో గంజాయి సరఫరా చాలా తక్కువగా ఉంటుందన్నారు. నగరంలో లాడ్జీలు, హోటళ్ళు, వాహనాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. గంజాయి, మత్తు పదార్ధాలతో పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు.
Updated Date - 2021-11-09T00:40:41+05:30 IST