ఉన్నత విద్య ప్రణాళికా మండలి ఏర్పాటు
ABN, First Publish Date - 2021-01-22T09:15:13+05:30
ఉన్నత విద్య ప్రణాళికా మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ దీనికి చైర్మన్గా, సెక్రెటరీ కన్వీనర్గా వ్యవహరిస్తారు.
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య ప్రణాళికా మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ దీనికి చైర్మన్గా, సెక్రెటరీ కన్వీనర్గా వ్యవహరిస్తారు. సభ్యులుగా.. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక సీఎస్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్-1, 2, కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్, 12 సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్కు చెందిన డైరెక్టర్ల నామినీ ఒకరు, రాష్ట్ర వర్సిటీలకు చెందిన వీసీ ఒకరు ఉంటారు. ఈ మండలి వార్షిక ఖర్చుల కోసం రూ.52.20 లక్షల బడ్జెట్ను కేటాయించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక సీఎస్ సతీశ్చంద్ర గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
Updated Date - 2021-01-22T09:15:13+05:30 IST