ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఈబీసీ నేస్తం’కు బడ్జెట్‌ కేటాయింపు

ABN, First Publish Date - 2021-04-21T09:52:11+05:30

ఆర్థికంగా వెనుకబడిన 45-60 ఏళ్ల వయసు అగ్రవర్ణ పేదల కోసం జగన్‌ ప్రభుత్వం రూపొందించిన ఈబీసీ నేస్తం పథకానికి 2021-22 బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రవర్ణ పేదలకు ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా వెనుకబడిన  45-60 ఏళ్ల వయసు అగ్రవర్ణ పేదల కోసం జగన్‌ ప్రభుత్వం రూపొందించిన ఈబీసీ నేస్తం పథకానికి 2021-22 బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రవర్ణ పేదలకు ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో 32 లక్షల మంది ఈబీసీ మహిళలు ఉన్నారని, అందులో 45-60 మధ్య వయసువారు 13.97 శాతం(4.47 లక్షల మంది) ఉన్నారని గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.15 వేలు చెల్లిస్తే ఏడాదికి రూ.670.56 కోట్లు, మూడేళ్లకు రూ.2011.68 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ ఆర్థిక సాయం ద్వారా అగ్రవర్ణ పేద మహిళల జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు అవకాశముంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కుటుంబ ఆదాయం గ్రామీణులకైతే రూ.10 వేల లోపు, పట్టణాల్లో అయితే రూ.12 లోపు ఉండాలి. 3 ఎకరాల్లోపు మాగాణి, 10 ఎకరాల్లోపు మెట్ట భూములు కలిగిన వారు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు అయి ఉండరాదు.  నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు అర్హులు కారు. మున్సిపాలిటీల్లో 750 చదరపు అడుగులపైన స్థలం ఉంటే అనర్హులవుతారు.

Updated Date - 2021-04-21T09:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising