ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పథకాల అమలులో వలంటీర్ల పాత్ర కీలకం

ABN, First Publish Date - 2021-04-19T05:59:29+05:30

సంక్షేమ పథకాలు, పౌరసేవలను ప్రజలకు అందించడంలో వలంటీర్ల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, ఏప్రిల్‌ 18: సంక్షేమ పథకాలు, పౌరసేవలను ప్రజలకు అందించడంలో వలంటీర్ల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ అన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవు మండలాల్లో ఉత్తమసేవలందించిన వలంటీర్లను సత్కరించారు. ఈసందర్భంగా జడ్పీ సీఈవో అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే పొన్నాడ మాట్లాడారు. నియోజకవర్గంలో ఐదుగురికి సేవావజ్ర, 24మందికి సేవారత్న అవార్డులను ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌ కమిడి ప్రవీణ్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి ఎన్‌వీ నాగేశ్వరనాయక్‌, డీఎస్పీ మాధవరెడ్డి, నగర పంచాయతీ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, నాయకులు పెయ్యల చిట్టిబాబు, పెన్మెత్స చిట్టిరాజు, నాలుగు మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించాలి

మలికిపురం, ఏప్రిల్‌ 18: గ్రామ వలంటీర్ల వ్యవస్థతో ఎన్నో ఫలితాలు ఉన్నాయని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద రాజోలు నియోజక వర్గంలోని వలంటీర్లను సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాబ్జిరాజు, మలికిపురం సర్పంచ్‌ గెడ్డం రాజ్యలక్ష్మి, తహశీల్దార్‌ నరసింహారావు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-19T05:59:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising