వీరేశ్వరస్వామికి లక్ష పత్రి పూజ
ABN, First Publish Date - 2021-05-10T05:56:45+05:30
మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి ఆదివారం లక్షపత్రి పూజ నిర్వహించారు.
ఐ.పోలవరం, మే 9: మురమళ్ల భద్రకాళీ సమేత
వీరేశ్వరస్వామికి ఆదివారం లక్షపత్రి పూజ నిర్వహించారు. మాస శివరాత్రి
మహాపర్వదినం పురస్కరించుకుని స్వామివారికి లక్ష మారేడుదళాలతో అభిషేకం
శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగాభట్ల
రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి లక్షపత్రి పూజా కార్యక్రమాలు
నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ చైర్మన్ పెన్మెత్స వాసురాజు, ఈవో మాచిరాజు
లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అర్చకులు ఉండి దత్తుశర్మ,
కిషోర్శర్మ పాల్గొన్నారు.
Updated Date - 2021-05-10T05:56:45+05:30 IST