వసంత నవరాత్రులు ప్రారంభం
ABN, First Publish Date - 2021-04-14T06:12:22+05:30
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ద్రాక్షారామ మాణిక్యాంబ అమ్మవారి సన్నిదిలో మంగళవారం వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి.
ద్రాక్షారామ, ఏప్రిల్ 13: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ద్రాక్షారామ మాణిక్యాంబ అమ్మవారి సన్నిదిలో మంగళవారం వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం నవరాత్రి దీక్షా సంకల్పం జరిగింది. అనంతరం భీమేశ్వరస్వామికి పంచామృత అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు శ్రీచక్రనవావర్ణార్చన, 6.30 గంటలకు సువర్ణ రజత విశేష పుష్పార్చన జరిపారు. రాత్రి 8 గంటలకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. కార్యక్రమంలో అర్చకులు, వేదపండితులు, స్వస్తివాచకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-04-14T06:12:22+05:30 IST