వాడపల్లి వెంకన్న ఆలయం మూసివేత
ABN, First Publish Date - 2021-04-21T05:47:08+05:30
వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని బుధవారం నుంచి ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
ఆత్రేయపురం, ఏప్రిల్ 20: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని బుధవారం నుంచి ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. కరోనా మహమ్మారి విస్తరించడంతో ఆలయంలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందికి కరోనా లక్షణాలు కనిపించాయి. వారికి దగ్గరగా పనిచేసిన మరికొంతమంది సిబ్బంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో 21 నుంచి 25 వరకు ఐదు రోజులపాటు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. 22 నుంచి జరిగే స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు రద్దు చేస్తామని ఈవో తెలిపారు. 23వ తేదీ శుక్రవారం జరగనున్న కల్యాణోత్సవం కేవలం అర్చకస్వాముల సమక్షంలో అంతరాలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్వామివారి అన్నప్రసాదం, కేశఖండనశాల నిలుపుదల చేశామన్నారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయాలు చేపడతామని ఈవో తెలిపారు.
Updated Date - 2021-04-21T05:47:08+05:30 IST