బాక్సింగ్ పోటీల విజేతలకు బంగారు పతకాలు
ABN, First Publish Date - 2021-03-01T06:29:34+05:30
అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు.
మామిడికుదురు, ఫిబ్రవరి 28: అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. నేపాల్లో ఈనెల24 నుంచి 28 వరకు జరిగిన పోటీల్లో అప్పనపల్లి గ్రామానికి చెందిన బొంతు గీతిక 90కిలోల విభాగంలో, మామిడికుదురుకు చెందిన బోయి అర్జున్ 50కిలోల విభాగంలో బంగారు పతకాలు సాధించినట్టు కోచ్ బొంతు మధుకుమార్ తెలిపారు. వారు నవయువ క్రీడాయువజన సేవాసంఘం ద్వారా కోచ్ మధుకుమార్ వద్ద శిక్షణ పొందుతున్నారు. విద్యార్థులను అమలాపురం ఎంపీ చింతా అనురాధ, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తదితరులు అభినందించారు.
Updated Date - 2021-03-01T06:29:34+05:30 IST