ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తాండవ’ రైతుల బకాయిలు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-12-04T05:27:35+05:30

తుని డిసెంబరు 3: తాండవ సహకార చక్కెర కర్మాగారానికి గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు పేమెంట్లు చేయడంతోపాటు కార్మికులకు ఇవ్వాల్సిన జీతాల బకాయిలను ఫ్యాక్టరీ యాజమ్యానం తక్షణం చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు డిమాండ్‌ చే

నిరసన దీక్ష వద్ద మాట్లాడుతున్న నరసింగరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు

తుని డిసెంబరు 3: తాండవ సహకార చక్కెర కర్మాగారానికి గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు పేమెంట్లు చేయడంతోపాటు కార్మికులకు ఇవ్వాల్సిన జీతాల బకాయిలను ఫ్యాక్టరీ యాజమ్యానం తక్షణం చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు డిమాండ్‌ చేశారు. తాం డవ షుగర్స్‌ గేటు ఎదుట ఏపీ రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం చెరకు రైతులు, కార్మికులు నిరసన దీక్ష నిర్వహించి వంటా వార్పూ చేశారు. నరసింగరావు మాట్లాడుతూ 4 నియోజకవర్గాల చెరకు రైతులు జీవనాధారంగా భావించే తాండవ షుగర్స్‌ను అన్నివిధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు సకాలంలో బిల్లులు, కార్మికులకు జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలు ఎలా బతుకుతాయని ఆలోచించడం లేదన్నారు. ప్రభుత్వం బకాయిలు వెంటనే చెల్లించాలని, 2021-22 సీజన్‌కు ఫ్యాక్టరీ నడిపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఈనెల23న జాతీయ రహదారిని దిగ్బంధిస్తామన్నారు. రైతు సంఘం నాయకులు కె.లోకనాధం, నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకులు ఎం.అప్పలరాజు, శేషుబాబ్జీ, కోటేశ్వరరావు, కర్రి అప్పారావు, రాజు, పద్మ, శ్రీను, కార్మిక నాయకులు శ్రీనివాసరావు, రమణ ఉన్నారు.

Updated Date - 2021-12-04T05:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising