తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ విజయం తథ్యం
ABN, First Publish Date - 2021-01-21T06:38:06+05:30
తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ తప్పక విజయం సాధిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్బాబు అన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాథ్బాబు
పి.గన్నవరం,
జనవరి 20: తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ తప్పక విజయం సాధిస్తుందని టీడీపీ
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్బాబు అన్నారు. బుధవారం ఉప
ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర
అధ్యక్షుడు కె.అచ్చెంనాయుడు ప్రారంభించారు. తనపై నమ్మకం ఉంచి తిరుపతి 21వ
వార్డు పరిశీలికుడిగా పార్టీ నియమించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో నాథ్బాబు,
రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వురి సురేష్ పాల్గొన్నారు.
Updated Date - 2021-01-21T06:38:06+05:30 IST