ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు

ABN, First Publish Date - 2021-03-21T05:56:00+05:30

దారి దోపిడీ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి సుమారు ఇరవై సెల్‌ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ శోభన్‌కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గండేపల్లి, మార్చి 20: దారి దోపిడీ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి సుమారు ఇరవై సెల్‌ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ శోభన్‌కుమార్‌ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సురేష్‌బాబు మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన జగ్గంపేట జేవీఅర్‌ కాంప్లెక్స్‌ వద్ద రాత్రి సమయంలో రాజమహేంద్రవరం వెళ్లేందుకు ఒక వ్యక్తి వేచి ఉండగా రంగంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌పై  వచ్చి రాజమహేంద్రవరం వరకు డ్రాప్‌ చేస్తామని ఎక్కించుకున్నారన్నారు. తాళ్లూరు నుంచి సైడ్‌రోడ్‌లోకి తీసుకెళ్లి దాడిచేసి అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌, వెయ్యి రూపాయలు దొంగలించారన్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి శుక్రవారం రాజానగరం వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇటువంటి దొపిడీలకు పాల్పడుతున్నారన్నారు. 

Updated Date - 2021-03-21T05:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising