టీడీపీ గెలుపు వైసీపీకి గుణపాఠం
ABN, First Publish Date - 2021-03-01T05:22:59+05:30
మన్యంలో వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలను ఎదిరించి మేజర్ పంచాయతీ అయిన రాజవొమ్మంగిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గొల్లపూడి రమణి గెలుపొందడం ఆ పార్టీకి గుణపాఠమని అరకు పార్లమెంట్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వంతల రాజేశ్వరి అన్నారు.
రాజవొమ్మంగి, ఫిబ్రవరి 28: మన్యంలో వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలను ఎదిరించి మేజర్ పంచాయతీ అయిన రాజవొమ్మంగిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గొల్లపూడి రమణి గెలుపొందడం ఆ పార్టీకి గుణపాఠమని అరకు పార్లమెంట్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వంతల రాజేశ్వరి అన్నారు. ఆదివారం రాజవొమ్మంగిలో నూకాలమ్మ ఆలయం వద్ద జరిగిన అన్నసమారాధనలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్ పార్టీ నేతలు దంతులూరి శివరామచంద్రరాజు, సంగం శ్రీకాంత్, నగేష్, తిమ్మాపురం సర్పంచ్ పప్పుల సోమాలమ్మ, గొల్లపూడి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-01T05:22:59+05:30 IST