ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు జిల్లాలో లోకేశ్‌ పర్యటన

ABN, First Publish Date - 2021-07-27T06:41:24+05:30

కాకినాడ సిటీ/రాజమహేంద్రవరం సిటీ, జూలై 26: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. రాజమహేంద్రవరంలో ఇటీవల మాతృవియోగంతో బాధలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్‌ నేత ఆదిరెడ్డి అప్పారావును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ సిటీ/రాజమహేంద్రవరం సిటీ, జూలై 26: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. రాజమహేంద్రవరంలో ఇటీవల మాతృవియోగంతో బాధలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్‌ నేత ఆదిరెడ్డి అప్పారావును ఉదయం 10 గంటలకు పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సామర్లకోటలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏర్పాటుచేసిన పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రసన్నాంజనేయ విగ్రహం సమీపాన ఉన్న కల్యాణ మండపంలో భోజనాలు చేసిన అనంతరం గండేపల్లి మండల పర్యటనకు లోకేష తరలివెళతారు. మధ్యాహ్నం 3 గంటలకు జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామంలో కొండయ్యదొర విగ్రహాన్ని లోకేశ్‌ ఆవిష్కరిస్తారు. గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడుగా పనిచేసిన దొర రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు, పౌరసరఫరాలశాఖ డైరెక్టర్‌గా, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడుగా పనిచేసి విశేష సేవలందించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

Updated Date - 2021-07-27T06:41:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising