ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెదుళ్లపల్లిలో చెరువు వివాదం

ABN, First Publish Date - 2021-06-23T05:26:51+05:30

మండలంలోని వెదుళ్లపల్లి పంచాయతీ రాజంపేట చెరువు వివాదం మళ్లీ మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం, జూన్‌ 22: మండలంలోని వెదుళ్లపల్లి పంచాయతీ రాజంపేట చెరువు వివాదం మళ్లీ మొదలైంది. రాజంపేట చెరువు వివాదం 2015 నుంచి రాజంపేట, వెదుళ్లపల్లి ఫిషర్‌మెన్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఆధీనంలో ఉండేది. రాజంపేట రామాలయానికి చెందిన చెరువు అని వారిని ఖాళీ చేయించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ చెరువు వద్ద 144 సెక్షన్‌ అమలు జరుగుతోంది. వారం క్రితం ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తహశీల్దార్‌ ఎన్‌.సీతాపవన్‌కుమార్‌ చెరువు వివాదంపై ఇరువర్గాలతో చర్చలు జరపడానికి ముందుకు రావడంతో వివాదం తిరిగి ప్రారంభమైంది. రాజంపేటకు చెందిన కొందరు మంగళవారం ఉదయం చెరువులోని చేపలను పట్టి జోరుగా అమ్మకాలు జరిపారు. ఫిషర్‌మెన్‌ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఎస్‌ఐ సుధాకర్‌, తహశీల్దార్‌ పవన్‌కుమార్‌ చెరువు వద్దకు చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ఫిషర్‌మెన్‌ సొసైటీలో ఉన్న రాజంపేటకు చెందిన వారికే చెరువు ఇస్తామని రాజంపేటకు చెందిన వారు తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఇవ్వాలని ఆలోచించి చెబుతామని వారు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

Updated Date - 2021-06-23T05:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising