తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-10-23T06:36:20+05:30
కన్న తండ్రి మందలించాడని క్షణికావేశంలో కుమారుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కరప పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కరప, అక్టోబరు 22: కన్న తండ్రి మందలించాడని క్షణికావేశంలో కుమారుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కరప పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరప మండలం జడ్.బావారం గ్రామానికి చెందిన దంగేటి రామకృష్ణ కాకినాడలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు కుమారులతో జీవిస్తున్నాడు. అతడి పెద్ద కుమారుడు సురేష్ ఆదిత్య(18) ద్రాక్షారామలోని ఒక ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చరల్ చదువుతున్నాడు. ఉదయం లేచినప్పట్నించి సురేష్ ఆదిత్య సెల్ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతుండడంతో తండ్రి రామకృష్ణ అతడ్ని మందలించాడు. దీంతో క్షణికావేశానికి లోనైన సురేష్ ఆదిత్య గురువారంరాత్రి పురుగులమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు క్షతగాత్రుడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కరప ఎస్ఐ డి.రమేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-10-23T06:36:20+05:30 IST