అన్నదాన పథకానికి రూ.3 లక్షలు
ABN, First Publish Date - 2021-10-18T05:51:46+05:30
రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి ఆదివారం ఇద్దరు దాతలు రూ.మూడు లక్షలు విరాళంగా సమర్పించారు.
అన్నవరం,
అక్టోబరు 17: రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ
నిత్యాన్నదాన పథకానికి ఆదివారం ఇద్దరు దాతలు రూ.మూడు లక్షలు విరాళంగా
సమర్పించారు. కర్నూలుకు చెందిన ఎంిసీ సత్యనారాయణ రూ.2,00,016 ఈవో
త్రినాథరావుకు అందజేశారు. దీనిపై వచ్చే వడ్డీతో ప్రతీ ఏటా వైశాఖ శుద్ద
ఏకాదశి రోజున అన్నదానం జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా దాతను ఈవో
అభినందించారు. జిల్లాలో కూనవరానికి చెందిన కర్రి సత్తిరెడ్డి మరో లక్ష
రూపాయలను సూపరింటెండెంట్ రమణకు అందజేశారు.
Updated Date - 2021-10-18T05:51:46+05:30 IST