ఘనంగా సత్తెమ్మతల్లి తీర్థం
ABN, First Publish Date - 2021-03-08T06:21:39+05:30
సీహెచ్.గున్నేపల్లిలో శ్రీసత్తెమ్మతల్లి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది.
ముమ్మిడివరం, మార్చి 7: సీహెచ్.గున్నేపల్లిలో శ్రీసత్తెమ్మతల్లి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈనెల3 నుంచి ప్రారంభమైన జాతర మహోత్సవాలు ఆదివారంతో ముగిసాయి. అమ్మవారిని బాజాభజంత్రీలు, బ్యాం డుమేళాలు, గరగనృత్యాలు, బాణసంచా కాల్పులతో గ్రామపురవీధుల్లో ఊరేగించారు. 2వేల మంది కళాకారులతో అమ్మవారి ఊరేగింపు కనులవిందుగా సాగింది. అమ్మవారి జాతర మహోత్సవాలను తిలకించేందుకు కోనసీమ నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భారీ అన్నసమారాధన నిర్వహించారు. అమ్మవారి తీర్థానికి అధికసంఖ్యలో భక్తులు తరలిరావడంతో మహిపాలచెరువు-పల్లంకుర్రు రోడ్డు భక్తులతో కిటకిటలాడింది. దీంతో ఆ రోడ్డులో వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. ముమ్మిడివరం సీఐ ఎం.జానకీరామ్ ఆధ్వర్యంలో ఎస్ఐ కేవీ నాగార్జున, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Updated Date - 2021-03-08T06:21:39+05:30 IST