రెవెన్యూ ఉద్యోగుల్లో చీలిక అవాస్తవం
ABN, First Publish Date - 2021-02-26T05:33:56+05:30
రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల్లో చీలిక లేదని, మొత్తం 13 జిల్లాల రెవెన్యూ ఉద్యోగులంతా ఐకమత్యంగా ఉన్నామని వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
- వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు బాపూజీ
రామచంద్రపురం, ఫిబ్రవరి 25: రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల్లో చీలిక లేదని, మొత్తం 13 జిల్లాల రెవెన్యూ ఉద్యోగులంతా ఐకమత్యంగా ఉన్నామని వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం విజయవాడలో జరిగిన సమావేశం 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు రాష్ట్ర కమిటీతో కలిసి జరగాల్సి ఉండగా కృష్ణా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారని, మిగిలిన 12 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకాకపోవడంతో రాష్ట్ర నాయకులు వారి ఉనికిని కాపాడుకోవడం కోసం లేనిపోని నిందారోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర సంఘం చీలిపోయినట్టు వారు ఇస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదన్నారు. ప్రభు త్వోద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.సూర్యనారాయణ, రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ చైర్మన వాసా దివాకర్, సచివాలయ ఉద్యోగుల చైర్మన ఎస్.రామి రెడ్డి నాయకత్వంలో వీఆర్వోల సంఘం కొనసాగుతుందని తెలిపారు.
Updated Date - 2021-02-26T05:33:56+05:30 IST