రెడ్డి సుబ్రహ్మణ్యానికి అస్వస్థత
ABN, First Publish Date - 2021-05-10T05:55:41+05:30
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
కొత్తపేట, మే 9: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ప్రథమచికిత్స పొంది, అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం వెళ్లారు. డాక్టర్ పర్యవేక్షణలో ఉన్న ఆయన శనివారం రాత్రి స్వగృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈవిషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డాక్టర్లతో మాట్లాడారు. అవసరమైతే హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తానని చంద్రబాబు డాక్టర్లతో చెప్పారు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Updated Date - 2021-05-10T05:55:41+05:30 IST