పెరిగిన ధరలను నిరసిస్తూ వామపక్షాల ధర్నా
ABN, First Publish Date - 2021-06-22T06:16:12+05:30
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సోమవారం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ముమ్మిడివరం, జూన్ 21: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సోమవారం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేసి ప్రజలపై ఆర్థికభారం మోపుతున్నాయన్నారు. వినతిపత్రాన్ని తహశీల్దార్ ఎస్.పోతురాజుకు అందజేశారు. కార్యక్రమంలో జి.దుర్గాప్రసాద్, సకిలే సూర్యనారాయణ, శీలం వెంకటేశ్వరరావు, పాము బాలయ్య, డి.వీరరాఘవులు, జగడం నాగేశ్వరరావు, ఎం.వెంకటేష్, వనచర్ల విజయకుమార్, పలివెల రాంబాబు, సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-22T06:16:12+05:30 IST