AP: పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
ABN, First Publish Date - 2021-09-30T14:14:04+05:30
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది.
రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.60 అడుగులకు చేరడంతో అధికారులు 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. 5.91 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేశారు. ఈరోజు సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు మూడు వేల క్యూసెక్కుల సాగునీరు విడుదల చేశారు.
Updated Date - 2021-09-30T14:14:04+05:30 IST