ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారుల దుస్థితిపై టీడీపీ వినూత్న నిరసన

ABN, First Publish Date - 2021-08-18T06:27:30+05:30

రహదారులపై గుంతలు పూడ్చడంలో మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రిజ్‌ను సత్కరించి వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పిఠాపురంలో గుంతవద్ద ఫ్రిజ్‌కు సత్కారం

పిఠాపురం, ఆగస్టు 17: రహదారులపై గుంతలు పూడ్చడంలో మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పిఠాపురం పట్టణంలోని వన్‌వే ట్రాఫిక్‌ రోడ్డులో స్టువర్టుపేట సమీపంలో కల్వర్టుకు కన్నం(గుంత) పడింది. దీన్ని పూడ్చాలని పలుమార్లు అధికారులు విన్నవించినా ఫలితం లేకపోవడంతో అక్కడికి సమీపంలోని ఒకషాపు నిర్వాహకుడు పాత ఫ్రిజ్‌ను గుంతలో ఉంచాడు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వర్మ ఆధ్వర్యంలో నాయకులు అక్కడ గుంతలో ఉంచిన ఫ్రిజ్‌ అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ సత్కారం చేశారు. నిరసనలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్‌, మున్సిపల్‌ టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ అల్లవరపు నగేష్‌, నాయకులు కోరుప్రోలు శ్రీనివాస్‌, కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీనివాస్‌, కరణం చిన్నారావు, నల్లా శ్రీను, పిల్లి చిన్నా పాల్గొన్నారు.

Updated Date - 2021-08-18T06:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising