విపత్కర సమయంలో విమర్శలొద్దు
ABN, First Publish Date - 2021-05-10T05:26:32+05:30
కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీలు చేతనైతే విలువై సూచనలు చేయాలే తప్పా విమర్శలు చేయడం దారుణమని వైసీపీ బీసీ సెల్ నగర్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం సిటీ, మే 9: కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీలు చేతనైతే విలువై సూచనలు చేయాలే తప్పా విమర్శలు చేయడం దారుణమని వైసీపీ బీసీ సెల్ నగర్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం జగన్ నుంచి వైద్యాధికారులు, ప్రజాప్రతినిధుల వరకు కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు కష్టపడుతున్నారని, ఇలాంటి సమయంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు విమర్శలు చేస్తున్నారని అన్నారు. చేతనైతే ఇలాంటి సమయంలో ప్రజలకు సహకరించాలే గాని రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
Updated Date - 2021-05-10T05:26:32+05:30 IST