పంచాయతీరాజ్ డీఈఈగా రాజ్కుమార్
ABN, First Publish Date - 2021-04-14T06:13:34+05:30
అమలాపురం పంచాయతీరాజ్ డీఈఈగా పళ్లా సుజన్రాజ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
అమలాపురం టౌన్, ఏప్రిల్ 13: అమలాపురం పంచాయతీరాజ్ డీఈఈగా పళ్లా సుజన్రాజ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ డీఈఈగా పనిచేసిన జె.మురళీకృష్ణ ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్ సహాయ సహకారా లతో నియో జకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ కె.చంటిబాబు, ప్రాజెక్ట్స్ డీఈఈ అన్యం రాంబాబు, జేఈలు రాధాకృష్ణ, సంపన్న, రెడ్డినాయుడు, అల్లాడి రమణ, బాలాజీ పాల్గొన్నారు.
Updated Date - 2021-04-14T06:13:34+05:30 IST