ఎన్టీఆర్ వర్ధంతిని విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2021-01-17T06:51:48+05:30
ఈనెల 18వ తేదీన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 25వ వర్థంతిని రాజోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయ వంతం చేయాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పిలుపునిచ్చారు.
రాజోలు, జనవరి 16: ఈనెల 18వ తేదీన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 25వ వర్థంతిని రాజోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయ వంతం చేయాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాటిపాకలోని ఆయన స్వగృహంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ సో మవారం ఉదయం 9గంటలకు స్థానిక సంత మార్కెట్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తామన్నారు. అనంతరం రాజోలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద కార్యకర్తలచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. జి ల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై విజయ వంతం చేయాలని మాజీమంత్రి గొల్లపల్లి కోరారు.
Updated Date - 2021-01-17T06:51:48+05:30 IST