27న ఎమ్మార్పీఎస్ సభ
ABN, First Publish Date - 2021-01-20T06:51:53+05:30
కిర్లంపూడి, జనవరి 19: రాజానగరం మండలం దోసకాయపల్లిలో ఈనెల 27న జరిగే ఎమ్మార్పీఎస్ సభను మాదిగలు విజయవంతం చేయాలని ఎ
కిర్లంపూడి, జనవరి 19: రాజానగరం మండలం దోసకాయపల్లిలో ఈనెల 27న జరిగే ఎమ్మార్పీఎస్ సభను మాదిగలు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ ఎం.చినసుబ్బారావు పిలుపునిచ్చారు. కిర్లంపూడిలో డివిజన్ కార్యకర్తల సమావేశం మండల మాజీ అధ్యక్షుడు గండేటి డేవిడ్రాజు మాదిగ అధ్యక్షతన నిర్వహించగా సుబ్బారావు మాట్లాడారు. ఈ సభకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. జిల్లా మాజీ అధికార ప్రతినిధి మం దేటి డేవిడ్రాజు, ఎమ్ఎ్సఎఫ్ సభ్యులు కాకాడ నూకరాజు దూళపల్లి వెంకటరమణ, జిల్లా మహిళా నాయకురాలు ఇంధన చిన్నారి పాల్గొన్నారు.
Updated Date - 2021-01-20T06:51:53+05:30 IST