ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్ ఏకగ్రీవం
ABN, First Publish Date - 2021-11-27T06:40:21+05:30
జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు.
- ధ్రువీకరణ పత్రం అందజేసిన రిటర్నింగ్ అధికారి
భానుగుడి (కాకినాడ), నవంబరు 26: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంత సత్య ఉదయ భాస్కర్కు ధ్రువీకరణపత్రం అందజేశారు. ఈ కార్య క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులా పల్లి ధనలక్ష్మి, ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి డీఆర్వో సీహెచ్ సత్తి బాబు తదితరులు పాల్గొని ఉదయభాస్కర్కు అభినందనలు తెలిపారు.
Updated Date - 2021-11-27T06:40:21+05:30 IST