ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదేం ఆహారం

ABN, First Publish Date - 2021-02-26T06:04:40+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు మంచి పౌష్ఠికాహారాన్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

ఇంద్రపాలెం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థుల ఆందోళన
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

కాకినాడ రూరల్‌, ఫిబ్రవరి 25: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు మంచి పౌష్ఠికాహారాన్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కాకినాడ రూరల్‌ మండలంలోని పలు పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న అల్లూరి సీతారామరాజు ట్రస్ట్‌ గతంలోనూ పలు పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యతలేని ఆహారాన్ని అందించింది. దీనిపై విద్యార్థులు భోజన కంచాలతో ఆందోళనకు దిగిన సంఘటన ఇంద్రపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగింది. పాఠశాలలో కొన్నిరోజులుగా ఆ హారం తింటుంటే కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం సరిగా ఉడక్క గట్టిగా ఉంటుందని తెలిపారు. గుడ్లు ఉడకడంలేదని, ఒక్కోసారి వాటినుంచి దుర్వాసన వస్తోందని వాపోయా రు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలా ఉన్నా తినాలని ఉపాధ్యాయులు ఇ బ్బంది పెడుతున్నారని తెలిపారు. గురువారం ఆహారం బాగోక ఆవులకు తినిపించడం గమనార్హం. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయురాలు వి.నాగేశ్వరిని వివరణ కోరగా రెండురోజులుగా ఆహారం గట్టిగా ఉంటుందని తెలిపారు. 

Updated Date - 2021-02-26T06:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising