పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2021-03-07T06:48:54+05:30
భార్య వదిలేసి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త బొట్ట నాగశంకర్(24) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఏఎస్ఐ కేవీ సత్యనారాయణ తెలిపారు.
కొత్తపేట, మార్చి 6: భార్య వదిలేసి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన భర్త బొట్ట నాగశంకర్(24) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఏఎస్ఐ కేవీ సత్యనారాయణ తెలిపారు. కొత్తపేటకు చెందిన బొట్ట నాగశంకర్కు వివాహమై ఒక కుమార్తె ఉంది. భార్య ఇటీవల అతడిని వదిలివేసి వెళ్లిపోయినట్టు, అతను మనస్తాపం చెంది ఈనెల2న పురుగులమందు తాగగా బంధువులు రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్టు అతడి తల్లి బొట్ట రమ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సత్యనారాయణతెలిపారు.
Updated Date - 2021-03-07T06:48:54+05:30 IST