ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో టూరిజం ప్రాజెక్టు

ABN, First Publish Date - 2021-10-29T06:55:46+05:30

రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి భూమిని అప్పగిస్తూ గురువారం అమరావతిలో జరిగిన కేబినెట్‌ సమావేశం నిర్ణయించింది. ఓబెరాయ్‌ విలాస్‌ పేరుతో ఓబెరాయ్‌ సంస్థ నిర్మించే ఈ రిసార్ట్‌లలో ఒకటి ధవళేశ్వరం బ్యారేజీ దగ్గరలోని పిచ్చుకలంకలో నిర్మిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పిచ్చుకలంకలో లగ్జరీ రిసార్ట్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌
  • కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు 

భానుగుడి(కాకినాడ), అక్టోబరు 28: రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి భూమిని అప్పగిస్తూ గురువారం అమరావతిలో జరిగిన కేబినెట్‌ సమావేశం నిర్ణయించింది. ఓబెరాయ్‌ విలాస్‌ పేరుతో ఓబెరాయ్‌ సంస్థ నిర్మించే ఈ రిసార్ట్‌లలో ఒకటి ధవళేశ్వరం బ్యారేజీ దగ్గరలోని పిచ్చుకలంకలో నిర్మిస్తారు. ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటుచేసేందుకు నిర్ణయించారు. అలాగే జిల్లాకు సంబంధించి పి గన్నవరంలో కొత్త అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇక్కడ కొత్తగా 19 పోస్టులు కేటాయిస్తూ కూడా నిర్ణయం ప్రకటించారు. ఇక సినిమా టిక్కెట్లు అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ఆన్‌లైన్‌ విధానం అమలుకోసం కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో ఉన్న 140 థియేటర్లకు సంబంధించిన టికెట్‌ బుకింగ్‌లు ప్రభుత్వ గుర్తింపు పొందిన యాప్‌లోనే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అమ్మ ఒడి పథకం పొందాలంటే ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాలనే నిర్ణయాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. తొలు త దీన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పారు.

Updated Date - 2021-10-29T06:55:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising