మహిళలకే పెద్దపీట
ABN, First Publish Date - 2021-01-24T06:22:48+05:30
పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. గత ఏడాది మార్చిలో వెలువడిన నోటిఫికేషన్లో 1103 సర్పంచ్ స్థానాలకు 55 శాతం పురుషులకు అవకాశం ఇవ్వగా, ఈ నోటిఫికేషన్లో మహిళలకు పది శాతం అదనంగా సీట్లు కేటాయించారు.
కాకినాడ (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. గత ఏడాది మార్చిలో వెలువడిన నోటిఫికేషన్లో 1103 సర్పంచ్ స్థానాలకు 55 శాతం పురుషులకు అవకాశం ఇవ్వగా, ఈ నోటిఫికేషన్లో మహిళలకు పది శాతం అదనంగా సీట్లు కేటాయించారు. అలాగే 12,234 వార్డు సభ్యుల విషయంలో స్ర్తీ, పురుషులకు చెరో 6117 స్థానాలకు పోటీ చేసే విషయంలో సమాన ప్రాతినిధ్యం కల్పించారు. వార్డు సభ్యుల మెజార్టీ బట్టి ఎన్నికల అనంతరం గ్రామ పంచాయతీల్లో కోరం మేరకు ఉపసర్పంచ్లను ఎన్నుకుంటారు.
Updated Date - 2021-01-24T06:22:48+05:30 IST