ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి పాక్షిక కర్ఫ్యూ

ABN, First Publish Date - 2021-05-05T05:43:30+05:30

పెద్దాపురం, మే 4: కొవిడ్‌ ఉధృతి రోజురోజుకూ తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలను ప్రారంభించిందని ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు తెలిపారు. స్థానిక విలేకర్లతో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 

12 గంటల వరకే వ్యాపారాలకు అనుమతి 

ఆర్డీవో మల్లిబాబు

పెద్దాపురం, మే 4: కొవిడ్‌ ఉధృతి రోజురోజుకూ తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలను ప్రారంభించిందని ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు తెలిపారు. స్థానిక విలేకర్లతో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగిందని, పరిస్థితి ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను ఈనెల 5వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపార కార్యకలాలపాలను సాగించుకోవాలన్నారు. ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ తరచూ శానిటైజర్‌ లేదా సబ్బుతో చేతులను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. బయటకు వెళితే కచ్చితంగా మాస్కు ధరించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే కొవిడ్‌ నియంత్రణ సాధ్యపడుతుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకే కార్యక్రమాలను నిర్వహించుకోవాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2021-05-05T05:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising