ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరిచ్చారు మీకీ అధికారం

ABN, First Publish Date - 2021-10-21T06:49:37+05:30

కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో బుధవారం అధికార పార్టీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం రసవత్తరంగా సాగింది.

కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్‌చార్జి మేయర్‌ను ప్రశ్నించిన కార్పొరేటర్‌
కార్పొరేషన్‌(కాకినాడ), అక్టోబరు 20: కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో బుధవారం  అధికార పార్టీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం రసవత్తరంగా సాగింది. పార్టీ నుంచి గెలిచిన వారికి కాకుండా వేరే పార్టీ వారికి పదవులు కట్టబెట్టడంతో కార్పొరేటర్ల మధ్య విద్వేషాలు బయటపడ్డాయి. కాకినాడ నగరపాలక సంస్థ అత్యవసర సమావేశాన్ని ఇన్‌చార్జ్‌ మేయర్‌ హోదాలో డిప్యూటీ మేయర్‌-2 చోడిపల్లి సత్యప్రసాద్‌ నిర్వహించారు. సమావేశం ప్రారంభంలోనే కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది.  22వ వార్డు కార్పొరేటర్‌ ఎమ్‌జీవీ కిశోర్‌ మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించిన సమావేశ అజెండా రాత్రికి రాత్రి వాట్సాప్‌లో పంపించడమేంటన్నారు. జూలై 7న చివరి మీటింగ్‌ జరిగిందని, రూల్‌ ప్రకారం  అక్టోబరు 7న సమావేశం జరగాలని, అత్యవసర సమావేశ మంటున్నారని కానీ    కార్పొరేటర్‌ రాజీనామా అజెండా తప్ప ముఖ్యమైన అంశాలు లేవన్నారు.  రెండో  డిప్యూటీ మేయర్‌కు మేయర్‌ బాధ్యతలు ఇమ్మని మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులను ప్రశ్నించారు. ఇది నాయకుడు నిర్ణయమని మిగిలిన కార్పొరేటర్లు చెప్పగా నాయకుడు అంటే ఎవరని కిశోర్‌ ప్రశ్నించారు.  ఇన్‌చార్జ్‌ మేయర్‌ చోడిపల్లి సత్యప్రసాద్‌ కలగజేసుకుని అన్నింటికీ సమాధానం చెప్పగలిగేశక్తి తనకుందని అంటుండగా మీరు చెప్పాల్సిన అవసరం లేదని,  అర్గనైజింగ్‌ సెక్రటరీ, కమిషనర్‌ దీనికి సమాధానం చెప్పాలని కిశోర్‌ అన్నారు. అయితే అధికారుల వద్ద సమాధానం లేకుండా పోయింది. కార్పొరేటర్‌ మీసాల ఉదయ్‌కుమార్‌,  కిశోర్‌ కుమార్‌ మధ్య మాటల యుద్ధం జరగడంతో మిగతా కార్పొరేటర్లు సర్దిచెప్పగా సమావేశం నుంచి కిశోర్‌ బయటకు వెళ్లిపోయారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కౌన్సిల్‌ సమావేశానికి వచ్చి కిశోర్‌ ఒక్కడినే ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లి మంతనాలు జరిపారు. ఇదిలాఉంటే ఇన్‌చార్జ్‌ మేయర్‌గా బాధ్యతలు తీసుకున్న చోడిపల్లి సత్యప్రసాద్‌ను అభినందించేందుకు పోడియం పైకి బయట వ్యక్తులు వచ్చినా అధికారులు కానీ పాలకవర్గ సభ్యులు కానీ పట్టించుకోకపోవడం విశేషం..

Updated Date - 2021-10-21T06:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising