ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజానగరంలో ఆభరణాల చోరీ

ABN, First Publish Date - 2021-07-27T05:38:43+05:30

ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో భద్రపర్చిన రూ.3.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించినట్టు సీఐ ఎంవీ సుభాష్‌ సోమవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజానగరం, జూలై 26: ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో భద్రపర్చిన రూ.3.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించినట్టు సీఐ ఎంవీ సుభాష్‌ సోమవారం తెలిపారు. యండమూరి వీరేంద్ర సతీ్‌షరామ్‌ రాజానగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌లో నివసిస్తున్నాడు. ఆయన కోటపాడులోని లిక్కర్‌ గొడౌన్‌లో అక్కౌంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి రావులపాలెంలోని అక్క ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు తెరిసి ఉండడాన్ని గమనించిన పక్కింటివాళ్లు యజమానికి సమాచారం అందించారు. వచ్చి చూసేసరికి బీరువాలో భద్రపర్చిన 53 గ్రాముల బంగారు, 98 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఎదురుగా ఉన్న ఇంట్లోకి కూడా చోరీకి యత్నించినప్పటికీ ఏ విధమైన వస్తువులు దొరకలేదని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రవికుమార్‌, క్లూస్‌టీం, డాగ్‌స్వాడ్‌ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శివనాగబాబు తెలిపారు. 

Updated Date - 2021-07-27T05:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising