జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
ABN, First Publish Date - 2021-04-13T06:50:33+05:30
గున్నేపల్లి అగ్రహారం గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా జనసేన కార్య కర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అవకత వకలకు పాల్పడిన ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్చేస్తూ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసైనికులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
అమలాపురం టౌన్, ఏప్రిల్ 12: గున్నేపల్లి అగ్రహారం గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా జనసేన కార్య కర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అవకత వకలకు పాల్పడిన ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్చేస్తూ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసైనికులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం వినతిపత్రాన్ని సబ్కలెక్టర్ కార్యాల యంలో అందజేశారు. ధర్నాలో పట్టణశాఖ అధ్యక్షుడు పిండి సాయిబాబా, అల్లవరం మండలశాఖ అధ్యక్షుడు రొక్కాల మహీపతి, కౌన్సిలర్లు యేడిద వెంకటసుబ్రహ్మణ్యం, తిక్కా సత్యలక్ష్మి, పడాల శ్రీదేవి, సీనియర్ నాయకులు ఆకుల బుజ్జి, కొప్పుల నాగమానస, ముత్యాల మణి, సూదా చిన్నా, మోటూరి వెంకటేశ్వరరావు, పరమట చిట్టిబాబు, సందాడి శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-13T06:50:33+05:30 IST