ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవీపట్నం గ్రామం.. 30 రోజులుగా వరద నీళ్లలోనే...

ABN, First Publish Date - 2021-07-28T06:41:46+05:30

ఒకటీ రెండూ కాదు.. ఏకంగా నెలరోజుల నుంచి ఆ గ్రామాలను వరద వదల్లేదు. గోదావరి ఎగువన ఉన్న ఈ పరీవాహక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

ఓ ఇల్లు పూర్తిగా మునిగిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవీపట్నం, జూలై 27: ఒకటీ రెండూ కాదు.. ఏకంగా నెలరోజుల నుంచి ఆ గ్రామాలను వరద వదల్లేదు. గోదావరి ఎగువన ఉన్న ఈ పరీవాహక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కాఫర్‌డ్యామ్‌ వల్ల వరద నీరు వెనక్కు మళ్లుతోంది. ఈ బ్యాక్‌వాటర్‌ వల్ల దేవీపట్నం మండలంలో సుమారు 31 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 44 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వాటిలో సుమారు 42 గ్రామాల్లో వరదనీరు చేరడమేకాకుండా గ్రామాలను కూడా ముంచేసింది. దీంతో పలు గ్రామాల ప్రజలు ముందుగానే తమకు ఇచ్చిన పునరావాస కాలనీలకు తరలివెళ్లగా, కొన్ని గ్రామాల నిర్వాసితులు అద్దె ఇళ్లకు తరలివెళ్లారు. ఇక కొండమొదలులో రెండ్రోజుల కిందట ఒక గిరిజనుడు వరదలో మునిగి మరణించినట్టు సమాచారం. 

Updated Date - 2021-07-28T06:41:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising