ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడవలో గిరిజన మహిళకు ప్రసవం

ABN, First Publish Date - 2021-11-29T06:29:45+05:30

రవాణా సౌకర్యం లేని గ్రామంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళ ఐటీడీఏ పీవో సహకారంతో అతి కష్టం మీద ఆస్పత్రికి చేరింది.

ఆస్పత్రికి తీసుకువస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్పత్రిలో చేర్పించేందుకు సహకరించిన ఐటీడీఏ పీవో
కూనవరం, నవంబరు 28: రవాణా సౌకర్యం లేని గ్రామంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళ ఐటీడీఏ పీవో సహకారంతో అతి కష్టం మీద ఆస్పత్రికి చేరింది. పాపికొండల ప్రాంతంలోని వరరామచంద్రాపురం మండలం గొందూరు గ్రామానికి చెందిన కొండరెడ్డి మహిళ సాందల జయసుధ ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులతో ఇబ్బంది పడు తుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మారుమూల గ్రామం కావడంతో అక్కడ నుంచి గర్భిణిని ఆస్పత్రికి చేర్చడం చాలా కష్టమైన పని. దీంతో  ఆమెను ఎలా ఆసుపత్రికి తీసుకురావాలో అర్థంకాని పరిస్థితి. ఈ క్రమంలో విషయాన్ని కుటుంబ సభ్యులు ఆమెను పడవలో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆమెకు అప్పటికే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గోదావరిలో ప్రయాణించే పడవపైనే  ప్రసవించింది. గొందూరు నుంచి పడవలో పోచవరం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కూనవరం వచ్చేందుకు ఎలాంటి వాహనం అందుబాటులో లేకపోవడంతో చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణకు ఫోన్‌ చేశారు. ఆయన చొరవతో 108 వాహనంను ఏర్పాటు చేశారు 108 వాహనంలో ఈఎంటీ శ్రీనివాస్‌, స్వరూప్‌లు వెంటనే కూనవరం ప్రభుత్వ ఆసుపత్రికి తల్లీబిడ్డను తరలించారు.  అనంతరం అక్కడి వైద్యులు తల్లీబిడ్డలకు వైద్యం అందించారు. వారు క్షేమంగా ఉన్నారు.  108 సిబ్బందికి డివిజన్‌ కోఆర్డినేటర్‌ యర్రంశెట్టి వాసు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-11-29T06:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising