తూర్పుగోదావరి జిల్లాలో విగ్రహాల ధ్వంసం
ABN, First Publish Date - 2021-10-15T16:41:36+05:30
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ విగ్రహాల ధ్వంసమైన ఘటన కలకలం రేపుతోంది...
కాకినాడ : ఆంధ్రప్రదేశ్లో మళ్లీ విగ్రహాల ధ్వంసమైన ఘటన కలకలం రేపుతోంది. దసరా పండుగ నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయి విగ్రహాలు ధ్వంసం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో చెరువుగట్టుపైగల దుర్గాదేవి ఆలయంలో కొందరు దుండగులు విగ్రహాలను ధ్వంసం చేశారు. వినాయకుడు, గాయత్రిదేవి, సరస్వతిదేవి విగ్రహాలను ధ్వంసం చేసినట్లు స్థానికులు గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2021-10-15T16:41:36+05:30 IST