ఆదిరెడ్డి కోటమ్మ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్
ABN, First Publish Date - 2021-07-27T17:59:44+05:30
నారా లోకేష్ మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
తూ.గో. జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆదిరెడ్డి కోటమ్మ కుటుంబసభ్యులను లోకేష్ పరామర్శించారు. అనంతరం సామర్లకోటలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమండ్రికి చేరుకున్న లోకేష్కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
Updated Date - 2021-07-27T17:59:44+05:30 IST