వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-08-13T18:15:41+05:30
వడ్డీ వ్యాపారి వేదింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది.
రాజమండ్రి: వడ్డీ వ్యాపారి వేదింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. ఆలమూరు మండలం జొన్నాడకు చెందిన నాగిరెడ్డి శ్రీనివాస్ పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శ్రీనివాస్కు తాడి సత్తిరెడ్డి అనే వడ్డీ వ్యాపారి 12 లక్షలు అప్పు ఇచ్చి దానికి 48 లక్షల వడ్డీ వేశాడు. వెంటనే దాన్ని చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ శ్రీనివాస్ను వేధింపులకు గురిచేశారు. అంతే కాకుండా బలవంతంగా యువకుడికి చెందిన ఇల్లును తనఖా రాయించుకున్నాడు. వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు...నాగిరెడ్డి శ్రీనివాస్ మృతదేహాంతో వడ్డీ వ్యాపారి సత్తిరెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
Updated Date - 2021-08-13T18:15:41+05:30 IST