ఉభయగోదావరి జిల్లాల బాస్కెట్బాల్ పోటీల విజేతలు
ABN, First Publish Date - 2021-01-17T06:55:21+05:30
ఉభయ గోదావరి జిల్లాల పురుషు ల విభాగంలో బాస్కెట్ బాల్ పో టీలు శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతు లు క్రీడా ప్రాంగణంలో ఈ నెల 14,15 తేదీలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గన్నమనేని చక్రవర్తి ఆ ధ్వర్యంలో నిర్వహించారు.
రామచంద్రపురం, జనవరి 16: ఉభయ గోదావరి జిల్లాల పురుషు ల విభాగంలో బాస్కెట్ బాల్ పో టీలు శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతు లు క్రీడా ప్రాంగణంలో ఈ నెల 14,15 తేదీలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గన్నమనేని చక్రవర్తి ఆ ధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అతి థులుగా పిల్లి సూర్యప్రకాష్, డాక్టర్ స్టాలిన్, పిల్లా వీరవెంకట సత్య నారాయణ, పోతు బాబూరావు, డాక్టర్ వెంకటరత్నం, మోడరన్ జీవీ రావు హాజరయ్యారు. ఈ పోటీలలో 13 టీములు పాల్గొన్నాయి. పోటీల విజేతలకు శనివారం రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రబోస్ బహుమతులు అందజేశారు. ప్రథమ బహు మతి రామ చంద్రపురం జట్టు, ద్వితీయ బహుమతి కాకినాడ జట్టు, తృతీయ బహుమతి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జట్టు, నాలుగో బహుమతి రాజమహేంద్రవరం జట్లు గెలుపొందాయి. వీరితో పాటూ ఉత్తమ క్రీడాకా రులకు బహుమతులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాది ఉండవిల్లి గోపాలరావు, వెటర్నరీ పోలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సీతారామయ్య, ఈలి ప్రేమ్కుమార్, చింతల పూడి వెంకటేశ్వర్రావు, బొజ్జా. మాణిక్యాలరావు, అనిల్ కుమార్, కృష్ణారెడ్డి, పార్థసారధి, వాసంశెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-17T06:55:21+05:30 IST